పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏ దైశానికైనా వెళ్లేందుకు ఫ్రీ వీసా ఇప్పిస్తానన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తే ఫ్రీ వీసా ఇప్పిస్తా.. లెట్స్ గో’ అని మోహక్ ఆన్లైన్ జాబ్ సెర్చింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్లో తాజాగా పోస్ట్ చేశారు. ఆఫర్ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ యూజర్లు అడగగా.. ప్రొసిజర్ను వివరంగా చెప్తూ మోహక్ మరో పోస్ట్ చేశారు. ‘నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే అందరికీ ఫ్రీ వీసా ఇస్తానని జులై 30న చెప్పాను. ఆగస్టు 8న జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. నీరజ్ గోల్డ్ మెడల్ నెగ్గితే యూజర్లందరికీ మా కంపెనీ తరఫున ఒక్క రోజు ఫ్రీ వీసా ఇప్పిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వీసా ఖర్చు మాదే. మీ ఈమెయిల్ కామెంట్ బాక్స్లో పెట్టండి. వీసా పొందేందుకు వీలుగా మీకు ఓ అకౌంట్ క్రియేట్ చేస్తాం’ అని మోహక్ క్లారిటీ ఇచ్చారు. యూఎస్లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్లో ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి.
0 Comments