Ad Code

ప్రధాని మోడీకి మమతా బెనర్జీ మరోసారి లేఖ !


కోల్‌కత్తా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినచట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని లేఖలో అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు జరుగుతుండటం భయానక పరిస్థితిని సూచిస్తోందన్నారు మమత. ఇలాంటి చర్యలు సమాజం, దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. సత్వర న్యాయం జరగాలంటే ఈ కేసుల విచారణ 15 రోజుల్లో పూర్తి చేయాలి అని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu