ఓ యువకుడు రైల్వే ట్రాక్స్పై చిత్రవిచిత్ర ప్రయోగాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా ఓ సైకిల్ను తీసుకొచ్చి ట్రాక్స్పై అడ్డుగా పడుకోబెట్టాడు. రైలు రాగానే అది తునాతునకలైంది. అంతటితో ఆగని ఆ ఆకతాయి ఆ తర్వాత ట్రాకులపై రాళ్లు, మినీ గ్యాస్ లిసిండర్, సిమెంట్ ఇటుకలు, సబ్బులు తదితరాలను పెడతాడు. రైలు వాటిపై నుంచి వెళ్తే ఏమవుతుందో అని వీడియో తీసి మరీ చూస్తాడు. అప్పటికీ ఆగని అతను చివరకు ట్రాకులపై ప్రాణంతో ఉన్న కోడిని కట్టేస్తాడు. కోడి కాళ్లకు టేప్తో చుట్టేసి, చివరగా దాన్ని ట్రాకులపై కట్టేస్తాడు. అయితే ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనలో కోడి కూడా చనిపోయి ఉంటుందని అంతా భావిస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవడంతో అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని, వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ''వ్యూస్, లైక్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు''.. అంటూ కొందరు, ''ఇలాంటి పనులు చేసే వారికి కఠిన శిక్షలు విధించాలి'' అంటుంటే మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్కు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది.
0 Comments