సామ్సంగ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 965 కిలోమీటర్లు ప్రయాణించే ఈవీ బ్యాటరీని ఆవిష్కరించింది. ఈ బ్యాటరీ భిన్న రూపాల్లో లభించనుంది. అంటే కార్లు, బైక్స్, ట్రక్స్, బస్సు ఇలా ఏ వాహనంలో అయినా ఉపయోగించుకునేలా సామ్సంగ్ ఈ బ్యాటరీని రూపొందిస్తుంది. సామ్సంగ్లోని బ్యాటరీ విభాగమైన సామ్సంగ్ ఎస్డీఐ దీన్ని రూపొందించింది. ఈ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం రీఛార్జ్ కావడం విశేషం. ఈ బ్యాటరీ ఏకంగా 20 ఏళ్లపాటు పనిచేస్తుందని కంపెనీ చెబతోంది. ఇప్పటికే ఈ బ్యాటరీకి సంబంధించి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని కంపెనీలకు చెందిన వాహనల్లో బ్యాటరీలను అమర్చి విస్తృత స్థాయిలో పరీక్షిస్తున్నారు. పరీక్షలన్నీ పూర్తి అయిన తర్వాత వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ చెబతోంది.
0 Comments