ఢిల్లీలోని టూ-వీలర్ డీలర్షిప్ సంస్థ రిసోర్స్ఫుల్ ఆటోమొబైల్స్ కు ఉన్నవి రెండే షోరూమ్స్. ఉద్యోగుల సంఖ్య కేవలం 8 మంది. 12 కోట్ల రూపాయలకు ఐపీఓ దరఖాస్తు చేస్తే ఏకంగా రూ. 4,800 కోట్లకు బిడ్స్ వచ్చాయి. రిసోర్స్ఫుల్ ఆటోమొబైల్స్ సంస్థ 10.2 లక్షల షేర్లను 117 రూపాయల ఫిక్సెడ్ ధరతో ఆపర్ చేసింది. ఈ ఇష్యూ ఆగస్ట్ 22న ఓపెన్ అయింది. ఆ తరువాత సోమవారం ఆగస్ట్ 26న క్లోజ్ అయింది. బీఎస్ఈ డేటా ప్రకారం ఈ 40.8 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. అంటే దాదాపు 400 రెట్లు అన్నమాట. ఈ ఆటోమొబైల్ సంస్థకు మర్చంట్ బ్యాంకర్గా దిల్లీలోని స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ వ్యవహరిస్తోంది. నిజానికి, ఈ బ్యాంక్ తమ ఐపీకు 10-20 రెట్లు బిడ్స్ రావాలనే లక్ష్యంతో పని చేసింది. ఒక చిన్న ఆటో కంపెనీకి ఈ టార్గెట్ కూడా ఎక్కువే. కానీ, దీనికి వారు ఊహించని స్పందన లభించింది.
0 Comments