భారత జట్టు ప్రధాన కోచ్గా భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. రెండేళ్లు గంభీర్ హెడ్ కోచ్గా కొనసాగనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హెడ్ కోచ్గా టీమిండియాలోకి గౌతమ్ గంభీర్ను సాదరంగా ఆహ్వానిస్తోన్నానని చెప్పారు. క్రికెట్ కెరీర్లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్.. ఇండియన్ క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందని జైషా తెలిపారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గంభీర్ కు బీసీసీఐ ఆయన అన్నివిధాలా సహకరిస్తుందని జైషా చెప్పారు. కాగా.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది. అయితే.. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
0 Comments