Ad Code

ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీలో 90 వేల కొత్త ఉద్యోగాలు ?


ఆర్థిక సంవత్సరంలో పలు దిగ్గజ ఐటీ కంపెనీలు 90 వేల మంది కొత్తవారికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ 2024-25 ఆర్థిక ఏడాదిలో 40 వేల మంది కొత్తవారికి ఉద్యోగ అవకాశాలివ్వాలని ప్లాన్ చేస్తోంది. అలాగే ఇన్ఫోసిస్‌ కూడా ఈ ఆర్థిక ఏడాది 15 వేల నుంచి 20 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్‌సీఎల్‌ టెక్‌ కంపెనీ 10 వేల మంది కొత్తవారిని క్యాంపసెస్‌ నుంచి తీసుకోనుంది. అలాగే విప్రో కంపెనీ కూడా ఈ ఆర్థిక ఏడాది 10 వేల నుంచి 12 వేల మంది ఫ్రెషర్స్‌ను చేర్చుకోనుంది. మరోవైపు టెక్‌ మహింద్రా కూడా ఈసారి 6 వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో 2024-2025 ఆర్థిక ఏడాదికి దాదాపు 90 వేల మంది కొత్తవారికి ఐటీలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో టీసీఎస్‌ 5,452 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 6,06,998 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక ఇన్ఫోసిస్‌ 2023-2024 ఆర్థిక ఏడాదిలో 11,900 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. 2022-23లో 50 వేల మందికిపైగా తమ కంపెనీలో చేర్చుకోగా.. 2023-2024 ఏడాదికి ఏకంగా 76 శాతం తగ్గించింది. అయితే ఈసారి తాము 20 వేల మంది వరకు కొత్తవారిని తీసుకుంటామని ఇన్ఫోసిస్ చీఫ్‌ ఫైనాన్షిల్ అధికారి జయేష్‌ సంగ్‌రాజ్క తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu