ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో ఐటీ కమ్యూనికేషన్ విభాగం పోలీసులు అలర్ట్ అయ్యారు. గత ప్రభుత్వ డేటా బయటకు వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. పలు ఫైళ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లపై నిఘా పెట్టారు. ఈ మేరకు సచివాలయంలో సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, ల్యాప్టాపులను పరిశీలించారు. ల్యాప్టాప్లు బయటకు తీసుకెళ్లొద్దని సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి, తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
0 Comments