ఫోన్ పే యాప్లో బగ్ ఉన్నట్లు బీహార్లోని భాగల్పూర్కు చెందిన ఓ యువకుడు గుర్తించాడు. బుధానాథ్కు చెందిన మయాంక్ సైబర్ భద్రత పరిశోధకుడు. ఇటీవల ఓటీపీ లేకుండా 'ఫోన్ పే'లో లాగిన్ అయ్యాడు. అనంతరం ఆ బగ్ సంగతిని 'ఫోన్ పే'కి తెలియజేశాడు. దీనిపై స్పందించిన ఆ సంస్థ మయాంక్కు ఈ-మెయిల్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. మరికొద్ది రోజుల్లో మయాంక్ను సన్మానించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా మయాంక్ పేరును హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చింది. ''నేను ఫోన్ పే ద్వారా చాలా మందికి డబ్బులు పంపుతున్నాను. ఈ క్రమంలో ఎవరైనా ఈ యాప్ను హ్యాక్ చేయగలరా అనే సందేహం వచ్చింది. ఆ తర్వాత ఫోన్ పేను హ్యాక్ చేయడంపై పరిశోధన ప్రారంభించాను.అప్పుడు నా ఫోన్లో ఓటీపీ సెక్షన్ను తొలగించాను. ఓటీపీ లేకపోయినా సులువుగా ఫోన్ పే యాప్లో లాగిన్ అయ్యాను. సాధారణంగా ఓటీపీతో ఫోన్ పే లాగిన్ అవ్వాలి. దీనిని బట్టి ఫోన్ పేను ఏ హ్యాకర్ అయినా హ్యాక్ చేయవచ్చని తెలుస్తోంది'' అని మయాంక్ తెలిపారు.
0 Comments