Ad Code

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు !


అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌-30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, ఎం అండ్‌ ఎం, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, రిలయన్స్, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గతవారాన్ని లాభాలతో ముగించాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.944 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.2,320 కోట్ల వాటాలను కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu