Ad Code

పల్లె సీమల్లోనూ పర్సనల్‌ కంప్యూటర్స్

ప్రపంచంలో అతిపెద్ద చిప్‌ తయారీసంస్థ అయిన ఇంటెల్‌ భారత్‌లో భారీ ప్రాజెక్ట్‌ చేపట్టనున్నట్లు వెల్లడించింది. భారత దేశంలోని మారు మూల గ్రామ ప్రాంతాలను కలుపుతూ (సుమారు 6,50,000 గ్రామాలుకు పైగా) లీజింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఐఎల్‌ ఎఫ్‌ఎస్‌) ద్వారా పల్లె సీమల్లోనూ పర్సనల్‌ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి సైతం ధృవీకరించారు. మేము ఐఎల్‌ ఎఫ్‌ఎమ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాము. దీని సాయంతో వచ్చే 18 నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయనున్నట్లు వెల్లడించింది. తద్వారా అనేకరకాలైన వాణిజ్య ప్రయోజనాలు గ్రామీణ భారతావనికి అందుతాయని సంస్థ తెలుపుతోంది

Post a Comment

0 Comments

Close Menu