సరైన రిజర్వేషన్ టికెట్ లేదా సరైన అనుమతి పత్రాలు లేకుండా ఎవరైనా రిజర్వేషన్ కోచ్లలోకి ప్రవేశిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రైల్వే బోర్డు హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ప్రవేశించే వారికి ఏకంగా రూ.2 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ఎస్సీ రైల్వే స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్డ్ కోచ్లలో జనరల్ టికెట్లతో ప్రయాణించడానికి ప్రయత్నించే వారు లేదా ఎలాంటి పర్మిషన్ లేకుండా అనధికారికంగా లోపలికి వెళ్లే వారు ఈ జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, రిజర్వ్ టికెట్ కలిగిన నిజమైన ప్రయాణీకుడిని ఎవరైనా సీటు విషయంలో ఇబ్బంది పెట్టినా లేదా వారి ప్రవేశాన్ని అడ్డుకున్నా మరింత కఠినమైన శిక్షలు అమలుకానున్నాయి. అలా ఇతరుల ప్రవేశాన్ని అడ్డుకునే వారిపై సుమారు రూ.వెయ్యి వరకు జరిమానా విధించడం జరుగుతుందని నిబంధనలలో పేర్కొన్నారు. ఒకవేళ తప్పు చేసిన ప్రయాణీకుడు ఆ జరిమానా మొత్తాన్ని అక్కడికక్కడే చెల్లించడానికి నిరాకరిస్తే, కోర్టు ద్వారా ఆ జరిమానా ఏకంగా రూ.3 వేల వరకు పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా కోచ్ నుంచి వారిని బలవంతంగా కిందకు దించేయడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరించారు.
0 Comments