మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న హింగోలి జిల్లాలో గురువారం ఉదయం 4.4 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంప కేంద్రం హింగోలి జిల్లాలో ఉందని, దీని ప్రకంపనలు పర్భణీ మరియు నాందేడ్ జిల్లాల్లో కూడా కనిపించాయి. భూకంప తీవ్రత తక్కువవగా ఉండటంతో ఏ భవనాలు దెబ్బతినలేదు. భూకంపం సంభవించిన తర్వాత, జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. భూమి లోపలి పొరల్లో జరిగే సహజ కదలికల వల్లే ఇలాంటి తక్కువ నుండి మధ్యస్థ తీవ్రత గల భూకంపాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. హింగోలి, పర్భణీ మరియు నాందేడ్ వంటి ప్రాంతాలు గతంలో కూడా ఇటువంటి ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో హింగోలి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
0 Comments