ఆఫ్ఘనిస్తాన్లో ఆకస్మికంగా వచ్చిన వరదల ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఈ శాన్య ప్రాంతమైన నూరిస్తాన్ ప్రావిన్స్లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఆకస్మిక వరదల వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పరున్ నగర మేయర్ సహా మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అలాగే 100 మందికి పైగా గల్లంతు అయ్యారు.దుర్గమ పర్వత ప్రాంతంలో సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఆకస్మిక వరదల కారణంగా పరూన్ నగరం అత్యంత తీవ్రంగా దెబ్బతిందని తాలిబన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఈ ఆకస్మిక వరదల ఉగ్రరూపం ఇళ్లను, వ్యాపార సముదాయాలను ముంచేసింది. వరద నీటిలో నిత్యావసర వస్తువులు సైతం కొట్టుకుపోయాయి. అంతేకాదు ప్రముఖ హోటల్స్ను సైతం వరదలు ముంచెత్తాయి. అలాగే రోడ్లు ధ్వంసం అయ్యాయి. క్లిష్టమైన పర్వత ప్రాంతం కావడంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకునేందుకు తీవ్ర అంతరాయం కలుగుతోంది అని అధికారులు తెలిపారు. వరద ఉధృతికి పరున్లోని ఇళ్లు, దుకాణాలు, మున్సిపల్ భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. 10 ప్రావిన్సుల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
0 Comments