రాజస్థాన్లో ఇసుక తుఫాన్ మళ్ళీ తీవ్రరూపం దాల్చింది. గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. చురు నగరాన్ని దట్టమైన ఇసుక మేఘాలు కమ్మేయడంతో పట్టణం అంధకారంలోకి వెళ్లిపోయింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక గాలుల ఉధృతికి చురు నగరం పూర్తిగా దెబ్బతింది. రోడ్ల మీద ప్రయాణం అసాధ్యంగా మారింది, వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాలి వేగం పెరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. స్థానికులు భయాందోళనలకు గురవుతూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0 Comments