Ad Code

స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డ ఎస్సై నరసింహులు

హైదరాబాద్‌ లోని గాంధీనగర్‌ ఎస్సై నరసింహులు మంగళవారం సాయంత్రం బాధితుడు నుంచి రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కారు. ఒక కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి భవిష్యత్‌లో తనపై ఎలాంటి వేధింపులకు గురి చేయవద్దని కోరుతూ ఓ వ్యక్తి ఎస్సైను సంప్రదించగా రూ. లక్ష డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు వ్యక్తి హైదరాబాద్‌ సిటీ రేంజ్‌ 1 ఏసీబీని ఆశ్రయించడంతో మంగళవారం సాయంత్రం మొదటి విడుతగా రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసి తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

Post a Comment

0 Comments

Close Menu