ఒమన్ తీరంలో సాంకేతిక లోపంతో భారతీయ నౌక ఎంఎస్ వీ విరాట్ 1నౌక మునిగిపోయినట్లు నేవీ అధికారులు ధృవీకరించారు. ఒమన్ తీరంలోని రాజ్ అల్ హద్ కు తూర్పున 80 నాటికల్ మైళ్ల దూరంలో ఆదివారం ఈఘటన జరిగింది. అయితే నౌకలో ఉన్న 14 మంది సిబ్బందిని అమెరికా నౌకాదళం రక్షించిందని భారత నావికా దళం అధికారులు ధృవీకరించారు.అమెరికాకు చెందిన మెరిటైమ పెట్రోల్ ఎయిర్ క్రాప్ట్ నుంచి లైఫ్ రాఫ్ట్ పడవను జారవిడిచి విరాట్ నౌకలోని సిబ్బందిని సురక్షితంగా తీర ప్రాంతానికి చేర్చినట్లు భారత నేవీవర్గాలు తెలిపాయి.
0 Comments