Ad Code

చెన్నై నుంచి హైదరాబాద్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరలింపు


మిళనాడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలను గతరాత్రి చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించి, బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఉంచారు. హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్యేల జాబితాలో మయిలాడుతురై ఎమ్మెల్యే జమాల్ మహమ్మద్ యూనస్, మేలూరు ఎమ్మెల్యే పి. విశ్వనాథన్, కులచల్ ఎమ్మెల్యే తారగై కుత్బర్ట్, విలవంకోడ్ ఎమ్మెల్యే ప్రవీణ్ టీటీ, కిలియూరు ఎమ్మెల్యే రాజేష్ కుమార్ ఎస్ ఉన్నారు. వీరిలో పి. విశ్వనాథన్ గతంలో తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్‌గా పనిచేశారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటైతే ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. మొదట సంప్రదింపుల కోసం అని చెప్పినప్పటికీ, చెన్నై రాజ్‌భవన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడటంతో వీరి బసను పొడిగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, తమ ఎమ్మెల్యేలకు గట్టి భద్రతతో పాటు గోప్యత ఉంటుందని ఏఐసీసీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా 'ఇన్సులేట్' చేయడమే ఈ 'సేఫ్ హౌస్ స్ట్రాటజీ' ప్రధాన ఉద్దేశ్యం. టీవీకే కూటమికి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఫిజికల్ వెరిఫికేషన్ కోరడంతో, ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు 'కింగ్ మేకర్స్'గా మారారు. వీరు మద్దతు ఇస్తేనే విజయ్ సర్కార్ కొలువుదీరే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu