Ad Code

గంగా స్పైన్ ఇంజురీ ఫౌండేషన్ కు అనంత్ అంబానీ దాతృత్వం


మిళనాడు లోని కోయంబత్తూరు గంగా స్పైన్ ఇంజరీ ఫౌండేషన్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ నుంచి విశేషమైన సహాయం అందనుంది. వెన్నెముక గాయాలతో బాధపడుతున్న రోగులకు ఈ సంస్థ అందిస్తున్న పునరావాస సేవల గురించి తెలుసుకున్న అనంత్ అంబానీ, ఆ సేవలకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అనంత్ అంబానీ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆర్థిక సహాయం ప్రకటించడం విశేషం. ఆయన అందించిన ఈ ఉదార సహాయానికి గంగా స్పైన్ ఇంజరీ ఫౌండేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ విరాళం వల్ల ఆర్థికంగా వెనుకబడిన రోగులకు ఎంతో ఉపశమనం లభించనుంది. ఫౌండేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అనంత్ అంబానీ అందిస్తున్న సహాయం ద్వారా పేద రోగులకు ఉచితంగా పూర్తి స్థాయి పునరావాస చికిత్స అందించనున్నారు. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి కనీసం 50 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో ఇప్పటివరకు ఖర్చుల కారణంగా చికిత్స పొందలేని అనేక మందికి ఇప్పుడు అవకాశం కలగనుంది. ఈ పునరావాస కార్యక్రమంలో రోగులకు విభిన్న విభాగాల నిపుణుల సేవలు లభిస్తాయి. ఇందులో వైద్య చికిత్సతో పాటు ఫిజియోథెరపీ, ఆక్వుపేషనల్ థెరపీ, కదలికలపై శిక్షణ, వీల్‌చైర్ వినియోగంపై మార్గదర్శనం, మూత్రం-మల విసర్జన నిర్వహణ, మానసిక పరామర్శ, పోషకాహార సాయం వంటి సేవలు ఉంటాయి. అదనంగా ఉపాధి అవకాశాలపై శిక్షణ, రోజువారీ జీవితానికి అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి కూడా ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం రోగులు తిరిగి స్వయం సమర్థులుగా మారడం, తమ జీవితం సాధారణ స్థితికి తీసుకురావడం. అలాగే వారు మళ్లీ ఉద్యోగాల్లో చేరి సమాజంలో గౌరవంగా జీవించేందుకు అవసరమైన ధైర్యం, నైపుణ్యాలను అందించడం. ఈ సందర్భంగా గంగా స్పైన్ ఇంజరీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రాజశేఖరన్ మాట్లాడుతూ, "అనంత్ అంబానీ చేసిన ఈ సహాయం మాకు ఎంతో విలువైనది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, రోగుల జీవితాల్లో ఆశను నింపే పెద్ద బలం. ఈ మద్దతు వల్ల వారి కుటుంబాలకు కూడా కొత్త ఆశలు కలుగుతాయి" అని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu