Ad Code

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదదు : 'స్కైమెట్' అంచనాలు


ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని  ప్రైవేట్ వాతావరణ సంస్థ 'స్కైమెట్' అంచనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది దీర్ఘకాల సగటు (LPA)లో కేవలం 90 నుంచి 95 శాతం వర్షపాతం మాత్రమే కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంటే, ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని, ఇది ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుతుపవనాలు బలహీనపడటానికి ప్రధాన కారణం 'ఎల్ నినో' ప్రభావమేనని స్కైమెట్ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఈ పరిస్థితి, భారత ఉపఖండంలో వర్షాలను తగ్గిస్తుంది. రుతుపవనాల ప్రారంభ దశలో ఇది మొదలై, ఏడాది చివర వరకు మరింత బలంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు అస్తవ్యస్తంగా ఉండవచ్చని అంచనా. రుతుపవన కాలం మొదటి సగం (జూన్, జూలై) ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, రెండో సగం (ఆగస్టు, సెప్టెంబర్) మాత్రం రైతులను ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. వర్షపాతం పంపిణీ అసమానంగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనవచ్చు. అయితే, భారత మహాసముద్ర డోలనం (IOD) సానుకూలంగా ఉంటే, ఎల్ నినో ప్రభావాన్ని ఇది కొంతవరకు అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నందున, అన్నదాతలు నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం ఉత్తమం. జూన్‌లో వర్షాలు ఆరంభంలో బాగుంటాయని అంచనా ఉన్నందున, విత్తనాలు వేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

Post a Comment

0 Comments

Close Menu