చైనాలో ఏప్రిల్ 21న ఒప్పో ఫైండ్ X9s ప్రో విడుదల కానుంది. ఒప్పో ఫైండ్ X9s ప్రో స్మార్ట్ఫోన్ 7,025mAh సామర్థ్యం కలిగిన అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో రానుంది. ఇది రెండు సిమ్ కార్డులను సపోర్ట్ చేసే 5జీ ఫోన్ కావడం మరో స్పెషల్. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త సాఫ్ట్వేర్పై ఇది పనిచేస్తుంది. వేగవంతమైన ఛార్జింగ్, డేటా బదిలీ కోసం ఇందులో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ను అందించారు. వెనుకవైపు నాలుగు కెమెరాల అమరికతో ఇది అలరించనుంది. ఇందులో రెండు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాలు ఉండటం విశేషం. వీటికి తోడు 50 మెగాపిక్సెల్, 3.2 మెగాపిక్సెల్ సెన్సార్లు జత చేశారు. ప్రసిద్ధ 'హాసెల్బ్లాడ్' సంస్థతో కలిసి ఈ కెమెరాలను ఒప్పో అభివృద్ధి చేసింది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఇది 6.3 అంగుళాల తెరను కలిగి ఉంటుంది. కేవలం 1.1 మిల్లీమీటర్ల అత్యంత సన్నని అంచులతో ఈ ఫోన్ ప్రీమియం లుక్ను ఇస్తుంది. కంపెనీ తన సొంత 'లూమో' ఇమేజింగ్ సాంకేతికతను ఇందులో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఆరెంజ్, వైట్, టైటానియం, రైడింగ్ ది విండ్ రంగుల్లో లభించనుంది. ఈ ఫోన్ ఇప్పటికే ముందస్తు బుకింగ్లకు అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 12జీబీ, 16జీబీ ర్యామ్ వేరియంట్లు, అలాగే 1టీబీ వరకు అంతర్గత నిల్వ సామర్థ్యంతో ఈ ఫోన్ లభిస్తుంది. ప్యాకేజీలో ఫోన్తో పాటు రక్షణ కవచం, ఛార్జింగ్ కేబుల్ కూడా అందించనున్నారు.
0 Comments