తమిళనాడులోని విరూద్నగర్ జిల్లా కుట్టనార్పట్టి గ్రామంలో బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి 10 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వినిపించాయి. సంఘటనా స్థలంలో ఐదు ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పడానికి అధికారులు కష్టపడుతున్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.
0 Comments