Ad Code

గర్భిణీ భార్యను దారుణంగా నరికి చంపిన భర్త !


ధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా చైన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమర్దా గ్రామంలో గృహ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన గర్భిణీ భార్యను దారుణంగా నరికి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం శుక్రవారం దంపతుల మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. సునీల్ తన భార్యను పాలకూర వండమని అడగగా, అప్పటికే వంట పూర్తయిందని, పాలకూర తర్వాత వండుతానని ఆమె చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సునీల్, ఆమెను ఇంటి వెనుక ఉన్న పొలంలోకి ఈడ్చుకెళ్లి గొడ్డలితో మెడపై రెండుసార్లు బలంగా నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో సునీల్ తల్లి, తమ్ముడు లేరు. హత్య చేసిన అనంతరం సునీల్ తన బంధువుల ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. కూలీ పనుల కోసం మహారాష్ట్ర వెళ్లిన ఈ దంపతులు ఇటీవలనే గ్రామానికి తిరిగి వచ్చారు. వీరికి మూడు, ఐదేళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న శీలా బాయి పుట్టింటి వారు గ్రామానికి చేరుకుని, నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భద్రత నడుమ పోస్టుమార్టం పూర్తి చేసి, అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడు సునీల్ ను అరెస్ట్ చేసి  కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Post a Comment

0 Comments

Close Menu