Ad Code

టోలిచౌకిలో ఐదు అంతస్తుల భవనం కూలి నలుగురు మృతి : ఆరుగురికి తీవ్ర గాయాలు


హైదరాబాద్ లోని టోలీచౌకిలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికి తీస్తోంది. ప్రస్తుతం సిబ్బంది శిథిలాలను తొలగిస్తోంది. పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలను గురించి దర్యాప్తు ప్రారంభించారు. ఐదు అంతస్తుల కొత్త భవనానికి ప్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగినప్పుడు పదిమంది తాపీ మేస్త్రీలు పనిచేస్తున్నట్టు సమాచారం. 

Post a Comment

0 Comments

Close Menu