ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలో శనివారం రాత్రి బలంగిర్-బర్గఢ్-మహాసముంద్ (బిబిఎం) డివిజన్కు చెందిన కీలక మావోయిస్టు నేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్తో పాటు మరో 14 మంది సరెండర్ అయ్యారు. లొంపోయిన వారిలో వికాస్ (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు), దినేష్ (ప్లాటూన్ సభ్యురాలు), కవిత (ప్లాటూన్ సభ్యురాలు), సవిత (ప్లాటూన్ సభ్యురాలు), మంగేష్ (డివిజనల్ కమిటీ సభ్యుడు - బీబీఎం), రింకు (ఏరియా కమిటీ సభ్యుడు), జుగ్ను (ప్లాటూన్ సభ్యుడు), అస్మిత (ఏరియా కమిటీ సభ్యురాలు), సస్మిత (ఏరియా కమిటీ సభ్యురాలు), సాస్మిత (ఏరియా కమిటీ సభ్యురాలు), కేడర్లుగా పోలీసులు గుర్తించారు. (ఏరియా కమిటీ సభ్యురాలు), రీటా (ఏరియా కమిటీ సభ్యురాలు), నీల (ఏరియా కమిటీ సభ్యురాలు), మీనా (ప్లాటూన్ సభ్యురాలు) మరియు బేబీ (డివిజనల్ కమిటీ మెంబర్ - బీబీఎం) ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, ఇద్దరు బలంగీర్-బర్గఢ్-మహాసముంద్ డివిజన్కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఏడుగురు ప్లాటూన్ సభ్యులు వున్నట్లు అధికారులు తెలిపారు.
0 Comments