రాజస్తాన్ లోని అజ్మీర్ లో దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టీకా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని స్థాయిలలో అభివృద్ధిని నిర్ధారించాలని నిశ్చయించుకుందని, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టీకా ప్రారంభం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు .కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతీ ఏడాది 14 ఏళ్ల సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు 'గార్డాసిల్' అనే టీకాను ఉచితంగా అందించాలనేది లక్ష్యం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించబడుతుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఉప-జిల్లా ,జిల్లా ఆసుపత్రులు, అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో 80 కంటే ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమైన హై-రిస్క్ రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్, గర్భాశయ క్యాన్సర్, (ముఖ్యంగా హెచ్పీవీ టైప్ 16, 18) ప్రముఖ క్యాన్సర్లలో ఒకటిగా ఉంది. ఈ వ్యాక్సిన్ హెచ్పీవీ టైప్ 16, 18తోపాటు టైప్ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని కేంద్రం తెలిపింది.
0 Comments