తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రభుత్వం చేపట్టిన అక్రమ విచారణను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కదిలి వచ్చిన ప్రజలకు ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వ నిరంకుశ, ప్రజావ్యతిరేక వైఖరిని ఎండగడుతూ గ్రామం నుంచి గడప దాటి, మండలం నుంచి జిల్లా దాకా, చివరకు రాజధాని వరకు ఎక్కడికక్కడ ఉధృత స్థాయిలో నిరసనలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అంకితభావం అపూర్వం అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమ చరిత్రను, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా జరుగుతున్న ఈ అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ప్రజాస్వామ్యానికి గట్టి సంకేతం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని, సంక్షేమాన్ని మరచిపోయి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి ఈ నిరసనలు స్పష్టమైన హెచ్చరిక అన్నారు.
అక్రమ విచారణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కదిలి వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు !
Monday, February 2, 2026
Former Minister KTR tweets on X telangana Thank you to the people welfare achieved under KCR's leadership and is engaging in revenge politics who came out across the state to protest the illegal inquiry
No comments:
Post a Comment