Ad Code

ఐదో తరగతి బాలికకు కార్డియాక్ అరెస్ట్


రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన రాజేంద్ర బపేడియా అనే వ్యక్తి తొమ్మిదేళ్ల కూతురు దివ్య స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎప్పటిలాగానే దివ్య స్కూల్‌కు వచ్చింది. ఉదయం ప్రేయర్ సమయానికి ముందు తోటి పిల్లలతో కలిసి స్కూల్‌ గ్రౌండ్‌లో ఆడుకుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి దివ్య కుప్పకూలిపోయింది. పాఠశాల సిబ్బంది వెంటనే ఆ బాలికను హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే సమయానికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలూ లేవు. దీంతో ఆ బాలిక కార్డియాక్ అరెస్ట్ కారణంగానే చనిపోయి ఉంటుందని వైద్యులు తెలిపారు. దివ్య అన్న అభిషేక్ కూడా కొన్ని నెలల కిందట ఇంట్లో ఆడుకుంటూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే సరికే ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా దివ్య కూడా అదే తరహాలో ప్రాణాలు కోల్పోయింది. నెలల వ్యవధిలోనే రాజేంద్ర కుటుంబం ఇద్దరు పిల్లలనూ కోల్పోవడం విషాదకరం. 

Post a Comment

0 Comments

Close Menu