తెలంగాణాలో ఏప్రిల్ నెల నుంచి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజిమెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే జీతాలు విడుదల చేయబడతాయి. ఈ నిర్ణయం ద్వారా జీతాల చెల్లింపులో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం, కార్పొరేషన్ ఉద్యోగులు అందరూ ఐఎఫ్ఎంఐఎస్ పరిధిలోకి వస్తారు. అంటే, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉద్యోగుల జీతాలు ఇకపై ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా మాత్రమే విడుదల అవుతాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా జీతాల విడుదల చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అకౌంటబిలిటీ పెరుగుతుంది. జీతాల చెల్లింపులో ఆలస్యం తగ్గి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందే అవకాశం ఉంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
0 Comments