దేశీయ మార్కెట్లో పోకో ఎక్స్8 ప్రో, పోకో ఎక్స్8 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్లను కంపెనీ త్వరలో విడుదల చేయనుంది. ఈ రెండు ఫోన్లు మిడ్-రేంజ్ నుంచి ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ను టార్గెట్ చేయనున్నాయి. పోకో ఎక్స్8 ప్రో ఫోన్ MediaTek Dimensity 8500 ప్రాసెసర్తో వస్తున్నట్లు సమాచారం. ఇది రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్లో మంచి పనితీరును అందించనుంది. బ్యాటరీ విషయంలో కూడా ఈ మొబైల్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో 6,500mAh భారీ బ్యాటరీ ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి. 8GB RAM + 256GB వేరియెంట్ ధర భారత కరెన్సీలో దాదాపు రూ.43 వేలు (€399.90) ఉండనుంది. 8GB RAM + 512GB వేరియెంట్ ధర రూ.53 వేలు (€449.90)గా.. 12GB RAM + 512GB వేరియెంట్ ధర రూ.51 (€479.90)గా ఉండనుంది. ఈ ధరలో ఇలాంటి స్పెసిఫికేషన్లు రావడంతో POCO X8 Pro మిడ్-రేంజ్ సెగ్మెంట్లో బలమైన పోటీదారుగా నిలవనుంది. పోకో ఎక్స్8 ప్రో మాక్స్ మోడల్ మరింత శక్తివంతంగా ఉండనుంది. ఇందులో Dimensity 9500s చిప్సెట్ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది హై-ఎండ్ పనితీరును అందించగల ప్రాసెసర్గా టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్లో ప్రధాన హైలైట్ బ్యాటరీనే. ఇందులో ఏకంగా 8,550mAh భారీ బ్యాటరీ ఇవ్వనున్నట్లు సమాచారం. దాంతో రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 12GB RAM + 256GB వేరియెంట్ ధర రూ. 57 (€529.90)గా.. 12GB RAM + 512GB వేరియెంట్ ధర రూ. 62 (€579.90)గా ఉండే అవకాశాలు ఉన్నాయి.
0 Comments