రాజస్థాన్లోని బికనీర్ జిల్లా నాపాసర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతున్నది. జనవరి 6న ఉదయం ఆ బాలిక స్కూల్కు బయలుదేరింది. మార్గమధ్యలో ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించి ఆ బాలికను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. కదులుతున్న కారులో ఒకరు తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని గంటల తర్వాత పొరుగు గ్రామంలోకి ఆ కారు ప్రవేశించింది. అనుమానించిన స్థానికులు ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఆ యువకులు బాలికను కారు నుంచి బయటకు తోసి పారిపోయారు. ఆ గ్రామస్తులు బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. జనవరి 11న ఆ బాలిక కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన యువకులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
0 Comments