Ad Code

గాజావ్యాప్తంగా ఇజ్రాయిల్‌ కాల్పులు : ఆరుగురు చిన్నారులతో సహా 20 మంది మృతి


జ్రాయిల్‌ సైన్యం గాజావ్యాప్తంగా జరిపిన కాల్పుల్లో 20మందికిపైగా మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున గాజా స్ట్రిప్‌లోని గాజా సిటీ, ఖాన్‌ యూనస్‌ నగరాలపై ఇజ్రాయిల్‌ సైన్యం బాంబు దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో ఆరుగురు చిన్నారులతో సహా 12 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు వైద్య వర్గాలు మీడియాకు వెల్లడించాయి. కాగా, ఇ జ్రాయిల్‌ శనివారం తెల్లవారుజామున గాజా సిటీలోని షేక్‌ రద్వాన్‌ పరిసరాల్లోని పోలీసు ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన జరిపిన బాంబు దాడిలో ఏడుగురు మరణించినట్లు గాజా నగరంలోని అల్‌ - షిఫా ఆసుపత్రి వర్గాలు అల్‌జజీరా మీడియాకు తెలిపాయి. సెంట్రల్‌ గాజాలో ఐదుగురు, దక్షిణ గాజాలోని అల్‌- మవాసి ప్రాంతంలో ఏడుగురు మృతి చెందినట్లు మీడియా తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu