గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఆరెంజ్ నదిపై రూ.45 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెనపై గిర్డర్ను చదును చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడి ఆచూకి దొరకలేదు. ఐదుగురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురు కార్మికులను రక్షించినట్లు పోలీసు సూపరింటెండెంట్ యువరాజ్సింగ్ జడేజా తెలిపారు. ఆచూకి దొరకని కార్మికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. పడిన పెద్ద కాంక్రీట్ దూలం తొలగించడం ద్వారా మాత్రమే ఎవరైనా కింద చిక్కుకున్నారో లేదో నిర్ధారించగలమని చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది.
0 Comments