మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలోని మంగ్రోల్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి స్థానికుడు గోపాల్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఘటనా స్థలంలో వెంటనే మంటలు వ్యాపించగా, గ్రామస్థులు ఆందోళనతో వాటిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గోపాల్ను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో గోపాల్ చెప్పిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి లబ్ధి పొందేందుకు అనేకసార్లు పంచాయతీ అధికారులను కలిసానని, కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో విసిగిపోయి ఈ చర్యకు పాల్పడ్డానని తెలిపాడు. పోలీసులు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
0 Comments