Ad Code

భూగర్భ గని నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీక్ : ఇద్దరు మహిళలు మృతి, పలువురికి అస్వస్థత


జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో బుధవారం భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్‌)కు చెందిన భూగర్భ గని నుంచి విష వాయువైన కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయ్యింది. కెందువాడి బస్తీలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మహిళలు మరణించినట్లు తెలుస్తున్నది. దీంతో ధన్‌బాద్-రాంచీ రహదారిని ఆ ప్రాంతవాసులు దిగ్బంధించారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. మరోవైపు భూగర్భ గని నుంచి విష వాయువు కార్బన్ మోనాక్సైడ్ లీక్ కావడంపై బీసీసీఎల్‌ కంపెనీ స్పందించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోనేందుకు మూడు అంబులెన్స్‌లను అక్కడ సిద్ధంగా ఉంచింది. ఆ ప్రాంతవాసులు అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించింది. ప్రజలు వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని కోరుతూ వారి ఇళ్ల గోడలకు ఆ కంపెనీ నోటీసులు అంటించింది. నివాసితులను సురక్షితమైన ప్రదేశాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ ఏరియా మేనేజర్‌ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu