హైదరాబాద్లో ఇండియాలోనే అతి పెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ను అల్లు సినిమాస్ వారు ఓపెన్ చేయబోతున్నారు. ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని అందించే ఉద్దేశంతో ఈ భారీ తెరను తీసుకొస్తున్నారు. 'అవతార్ : ఫైర్ అండ్ యాష్' సినిమాతో ఈ కొత్త డాల్బీ స్క్రీన్ స్టార్ట్ కాబోతుందట. ఈ స్క్రీన్ వెడల్పు 75 అడుగులు ఉంటుందట. DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్లో డిజైన్ చేశారు. విజువల్స్ అయితే మెంటల్ మాస్ అంతే. దీనికోసం టాప్ క్లాస్ #DolbyVision తో పాటు, 3D ఎక్స్పీరియన్స్ కోసం #Dolby3D టెక్నాలజీ వాడుతున్నారట. సౌండ్ గురించి చెప్పాలంటే, DolbyAtmos సౌండ్ సిస్టమ్ యాడ్ చేశారు. ఇది ఆడియన్స్ను సినిమా లోపలికి లాక్కెళ్లినంత ఫీలింగ్ ఇస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా, హాయిగా సినిమా చూసేందుకు వీలుగా, థియేటర్లో 'పిచ్-బ్లాక్ స్టేడియం సీటింగ్' కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద, సినిమా చూసే అనుభవాన్ని ఇది మరో లెవల్కు తీసుకెళ్లడం పక్కా. దీంతో ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
0 Comments