చాంద్రాయణగుట్టలో ఆటోలో రెండు మృతదేహాలు లభ్యం !


హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్టలో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. చాంద్రాయణ గుట్ట పీఎస్ పరిధిలోని రోమన్ హోటల్ ఎదురుగా ఆటోలో ఉన్న మృతులు జహంగీర్‌, ఇర్ఫాన్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో మూడు సిరంజీలు లభ్యమయ్యాయి. డ్రగ్స్ అధిక మోతాదే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు యువకుల మృతిపై పోలీసుల విచారిస్తున్నారు.

Post a Comment

0 Comments