ఇండిగో విమానయాన సంస్థ ఇప్పటి వరకూ రూ.610 కోట్లను రీఫండ్ చేసినట్టు పౌరవిమానయాన శాఖ తాజాగా వెల్లడించింది. సుమారు 3000 వేల వరకూ సూట్కేసులు, ఇతర లగేజీని కూడా తిరిగిచ్చినట్టు తెలిపింది. ఇక ఇండిగో కార్యకలాపాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆదివారాల్లో ఇండిగో రోజుకు సగటున 2,300 ఫ్లైట్ సర్వీసులు నిర్వహిస్తుంటుంది. నేడు 1,500 విమాన సర్వీసులను నడిపేందుకు ప్లాన్ చేసింది. డిసెంబర్ 10 నాటికి పూర్తిస్థాయిలో నెట్వర్క్ స్థిరీకరణ జరుగుతుందని కూడా సంస్థ అంచనా వేస్తోంది. సమయ పాలనకు సంబంధించి త్వరలో 75 శాతం మార్కును చేరుకుంటామని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ సిబ్బందికి తాజాగా పంపిన అంతర్గత మెసేజీలో పేర్కొన్నారు. ఫ్లైట్ల రద్దుపై వివరణ కోరుతూ డీజీసీఏ సంస్థ సీఈఓకు, అకౌంటబుల్ మేనేజర్ ఇసిడ్రో పోర్కేరాస్కు ఇటీవలే షో కాజ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఎయిర్లైన్స్పై రాజకీయ విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఇండిగో మేనేజ్మెంట్, పౌర విమానయాన శాఖ వైఫల్యం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు.
0 Comments