తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు ఉదయం నుంచి సీఎం హై-ప్రొఫైల్ భేటీల షెడ్యూల్లో ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇంకా పలువురు కేంద్ర మంత్రులను కలిసి హైదరాబాద్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్-2026కు అధికారికంగా ఆహ్వానం పత్రిక అందజేయనున్నారు. ఈ సమ్మిట్ను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించి, తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే దేశ రాజకీయ నాయకత్వం మొత్తాన్నీ ఒకే వేదికపై చేర్చేందుకు సీఎం రేవంత్ స్వయంగా ఢిల్లీలో పర్యటిస్తారు. అదనంగా కొన్ని కేంద్ర పథకాలు, రాష్ట్రానికి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
0 Comments