బులియన్ మార్కెట్లో ఈరోజు కిలో వెండిపై రూ.11,000 పెరిగింది. దీంతో సరికొత్త రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. ఈరోజు కిలో వెండి ధర రూ.2,51, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్లో మాత్రం ఈరోజు రూ.20,000 పెరగడంతో కిలో వెండి ధర రూ.2,74,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,51, 000 దగ్గర అమ్ముడవుతోంది. బంగారం ధర కూడా దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,200 పెరిగి.. రూ.1,41,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100 పెరిగి రూ.1,29,450 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900 పెరిగి రూ.1,05,920 దగ్గర ట్రేడ్ అవుతోంది.
0 Comments