హర్యానాలోని లఖన్ మజ్రాలోని స్పోర్ట్స్ గ్రౌండ్లో రోహ్తక్కు చెందిన జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారుడు ప్రాక్టీస్ చేసే సమయంలో బాస్కెట్బాల్ హుప్ను పట్టుకొని వేలాడుతుండగా పోల్ విరిగి అతనిపై పడింది. వెంటనే తోటి క్రీడాకారులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ క్రీడాకారుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితం బహదూర్గఢ్లోని హోషియార్ సింగ్ స్పోర్ట్స్ స్టేడియంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో క్రీడాకారులు భయాందోళనకు గురవుతున్నారు.
0 Comments