ప్లాటినం ఆభరణాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కొత్త పరిమితులు విధించింది. వాణిజ్య నియమాలను కట్టుదిట్టం చేస్తూ వెంటనే అమల్లోకి వచ్చిన ఈ నియంత్రణలు 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయి అని డీజీఎఫ్టీ తెలిపింది. థాయ్లాండ్, ఆసియన్ దేశాలతో ఉన్న ఉచిత వాణిజ్య ఒప్పందాల దుర్వినియోగాన్ని అరికట్టడమే ప్రధాన ఉద్దేశ్యం. ఇదివరకు వెండి ఆభరణాల దిగుమతులపైనా ఇలాంటి పరిమితులు పెట్టారు. ఈ చర్య దేశీయ ప్లాటినం ఆభరణాల తయారీ రంగానికి దీర్ఘకాలంగా లాభదాయకం అవుతుంది.
0 Comments