Ad Code

నా చావుకు కారణం పీజేఎంఆర్,హెచ్ఎస్, కేటీఆర్ కారణం !


తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ కార్యకర్త ఆశా ప్రియ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు కారణం కేటీఆర్ అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆ పోస్టులో బీఆర్ఎస్ సోషల్ మీడియా తనను వేధింపులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. తన చావుకు పీజేఎంఆర్,హెచ్ఎస్,  కేటీఆర్ కారణం అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఆ పోస్టులో కొన్ని గంటల్లో తన నుంచి ఎలాంటి పోస్ట్ రాకుంటే చనిపోయాననే అర్థం అని తెలిపారు. వేధింపులకు సంబంధించిన ఆధారాలు అన్నీ తన వాట్సాప్ సెల్ఫ్ చాట్‌లో ఉన్నాయని, తనపై వేధింపులకు ఎవరు కారణం అనేది అక్కడ ఉంటుందని చెప్పారు. ఇదే తన మరణ వాంగ్మూలం అని కేసు పెడితే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకువస్తుందని, అందుకే తాను చనిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ నువ్వు ఏం మనిషివి ? నా గురించి నీ మనుషులు ఏం మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించారు. పార్టీలో ఉండే మహిళలతో నీకు సంబంధం ఉందని తన ఫోన్ లో చెప్పారని ఆరోపించారు. మాట్లాడిన సాక్ష్యాలు బయటపెట్టాలా అని నిలదీశారు. తనపై వేధింపులకు పాల్పడుతున్న పిల్ల జమిందార్‌ను తెలిసి కూడా పక్కన పెట్టుకుని ఫోటోలు దిగుతున్నావ్ అంటే, నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావని అర్థం అంటూ ఆరోపించారు. గతంలో ఆశాప్రియ బీఆర్ఎస్ కార్యకర్తగా పార్టీలో ఎంతో చురుకుగా ఉండేవారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పార్టీకి మద్దతుగా పోస్టులు చేసేశారు. అయితే ఓ నేత వేధింపుల కారణంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతకు ముందు పార్టీలో ఒక వెదవ ఉన్నాడు, వాడికి తప్ప ఎవరికి సపోర్ట్ చేసినా అడ్డమైన లింకులు పెట్టి నరకం చూపిస్తాడు అంటూ ఆశ ప్రియా ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. సూసైడ్ అటెంప్ట్‌కు ముందు 'కేటీఆర్ అన్న ఈ చెల్లెలు పిలుపు ఇదే చివరిసారి అవుతుంది.. ఒక్కసారి పలుకు అన్నా అంటూ ఎక్స్ లో చివరి పోస్ట్ పెట్టారు.

Post a Comment

0 Comments

Close Menu