మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మహారాష్ట్ర ఫల్తాన్ సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పని చేస్తున్న యువ డాక్టర్ సంపద ముండే బుధవారం రాత్రి ఫల్తాన్లోని ఓ హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో ఒక పోలీస్ అధికారి మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. సంపద ముండే చేతిపై రాసుకున్న నోట్లో పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ గోపాల్ భాద్నే తనను మానసికంగా, శారీరక వేధింపులకు గురిచేశాడని, అతను ఆమెను ఐదు నెలల్లో 4నాలుగుసార్లు బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అలాగే మరొక పోలీస్ అధికారి ప్రశాంత్ బంకార్ మానసికంగా ఒత్తిడికి గురి చేశాడని నోట్ లో రాసింది. సంపద ముండే ఆరోపణలు పోలీసులను తీరుకు అద్దం పడుతున్నాయని, నిందితులపై చర్యలకు వైద్యసంఘాలు డిమాండ్ చేశాయి.
0 Comments