చండీగఢ్లోని ప్రధాన మార్కెట్ ప్రాంతమైన సెక్టార్ 17లోని బహుళ అంతస్తుల భవనం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాకయ్యారు. కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. కూలిన బిల్డింగ్ శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. శిథిలాల్లో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రాణ నష్టం జరిగిందా? అన్నది ఇంకా తెలియలేదు. అయితే బహుళ అంతస్తుల బిల్డింగ్ కూలడాన్ని రోడ్డుపై వెళ్లే ఒక వ్యక్తి మొబైల్లో రికార్డ్ చేశాడు. షాక్కు గురి చేసేలా ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
0 Comments