అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, వివాదాస్పద బిలియనీర్ జార్జి సోరెస్ లను అధ్యక్షుడు బైడెన్ అత్యుత్తమ పురస్కారమైన 'ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడం'తో గౌరవించారు. వైట్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తో సహా కేబినెట్ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయాలు, క్రీడలు, కళలకు సంబంధించిన 19 మంది వ్యక్తులకు ఈ అవార్డుల్ని ప్రకటించారు. వోగ్ ఎడిటర్ ఇన్ చీఫ్ అన్నా వింటౌర్, శాస్త్రవేత్త బిల్ నై, ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, నటులు మైఖేల్ జె ఫాక్స్, డెంజెల్ వాషింగ్టన్ తో పాటు మరో 14 మందికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. షెడ్యూల్ వివాదం కారణంగా, అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఈ అవార్డును స్వీకరించేందుకు వైట్ హౌస్ కు వ్యక్తిగతంగా హాజరుకాలేదు. బిలియనీర్ జార్జ్ సోరోస్ని 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్'తో గౌరవించాలన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న నిర్ణయంపై ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. 'బైడెన్ సోరోస్కి ప్రెసిడెన్షియల్ మెడల్ని ఇవ్వడం హాస్యాస్పదం, ఒక విడ్డూరం' అని మస్క్ విమర్శించారు.
0 Comments