ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే, ప్రీమియం చెల్లింపు కాలం పరిమితంగా ఉండగా, ప్రయోజనాలు జీవితాంతం అందేలా రూపొందించబడింది. ఈ పాలసీ ద్వారా జీవితాంతం గ్యారెంటీ రిటర్న్స్ పొందవచ్చు. ముందుగా నిర్ణయించిన కాలానికి ప్రీమియం చెల్లించి, జీవితాంతం ప్రతి సంవత్సరం పెట్టుబడిలో 10% పెన్షన్ రూపంలో పొందవచ్చు. దీనికి వయసు పరిమితి కనీస వయసు 90 రోజులు కాగా, గరిష్ఠంగా 65 ఏళ్లు ఉంది. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు. అంటే, మీరు చెల్లించే ప్రీమియం మొత్తానికి ఆరు ప్రకారం పాలసీ గడువు ముగిసే నాటికి రూ. 5 లక్షలు సమ్ అష్యూర్డ్ ఉండాలి. ప్రీమియం చెల్లింపుల కాలం 5 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తైన తర్వాత, డిఫర్డ్ పీరియడ్ (వేచి ఉండే సమయం) ముగిసిన వెంటనే, ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్లో 10% చొప్పున జీవితాంతం పొందవచ్చు. పాలసీదారుడు 100 సంవత్సరాలు జీవించి ఉంటే, ఆ కాలం వరకూ ఈ రిటర్న్స్ కొనసాగుతాయి. ఒక సంవత్సరం రూ. 50,000 పొందాలనుకుంటే, కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు ఉండాలి. ఈ పాలసీకి 5 ఏళ్ల ప్రీమియం చెల్లింపును ఎంచుకున్నట్లయితే, ప్రతి సంవత్సరం దాదాపు రూ. 1.16 లక్షలు (జీఎస్టీతో కలిపి) ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం చెల్లింపు 5 సంవత్సరాల తరువాత 5 సంవత్సరాల డిఫర్డ్ పీరియడ్ ఉంటుంది. 11వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రూ. 50,000 చొప్పున రాబడి పొందవచ్చు. పాలసీదారుడు అకాల మరణం చెందితే రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ రూపంలో కుటుంబానికి అందుతుంది. ఇది సహజ మరణాలకు మాత్రమే వర్తిస్తుంది. యాక్సిడెంట్ బెనిఫిట్, డిసేబిలిటీ బెనిఫిట్స్ కోసం యాడ్ ఆన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీ తీసుకునే సమయంలో, ప్రీమియం టర్మ్ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే డిఫర్డ్ టైమ్ ఆయా టర్మ్ల ప్రకారం మారుతుంది.
0 Comments