Ad Code

మెట్రో ట్రైన్ డోర్ లో ఇరుక్కున్న ప్రయాణికుడు !


హైదరాబాద్ మెట్రోలో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. సెన్సార్ పనిచేయక ఓ వ్యక్తి డోర్ లో ఇరుకున్నాడు. ఖైరతాబాద్  మెట్రోస్టేషన్ లో ఓ ప్రయాణికుడు మెట్రో రైలు దిగుతుండగా సెన్సార్ పనిచేయక, డోర్స్ మూసుకోవడంతో ఆ వ్యక్తి డోర్ లో ఇరుక్కున్నాడు. తక్షణమే స్పందించిన తోటి ప్రయాణికులు లాగడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కాగా ఈ ఘటనపై మెట్రో నిర్వాహకులు స్పందిస్తూ సెన్సార్ వ్యవస్థ పనిచేయక పోవడం వలన ఈ ఘటన జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామని తెలియజేశారు.

Post a Comment

0 Comments

Close Menu