Ad Code

తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా శోభా కరంద్లాజే


రాష్ట్రాల అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యుల నియామకానికి ప్రత్యేక ఎన్నికల అధికారులను బిజెపి నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం 29 మంది అధికారులతో కూడిన జాబితాలు బిజెపి కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల అధికారిగా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభా కరంద్లాజే.. నియమించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సీనియర్ మంత్రులు నియమించింది. తెలంగాణకు శోభా కరంద్లాజే.. ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ,బీహార్ ,మధ్యప్రదేశ్ లకు కేంద్ర మంత్రులను ఎన్నికల అధికారులుగా నియమించింది బిజెపి. ఈ ప్రక్రియ బీజేపీ పార్టీ శక్తిని మరింత బలపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. గుజరాత్ కి భూపేంద్ర యాదవ్, కర్ణాటక కు శివరాజ్ సింగ్ చౌహన్, ఉత్తరప్రదేశ్ కు పీయూష్ గోయల్, బీహార్ కు మనోహర్ లాల్ కట్టర్, మధ్యప్రదేశ్ కు ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల అధికారులుగా నియమితులయ్యారు.

Post a Comment

0 Comments

Close Menu