తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ క్లూజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కనకయ్య, ప్రకాశ్ అనే ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్ మోగించి అలెర్ట్ ప్రకటించింది.
0 Comments